జొహన్నెస్బర్గ్, జూన్ 7: దక్షిణాఫ్రికాలో అవినీతికి పాల్పడిన భారత సంతతికి చెందిన రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తా సోదరులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి అవినీతి కారణంగా ఏకంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా 2018లో గద్దె దిగాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడి కేంద్ర మంత్రులను కూడా ఎవరిని నియమించాలో వీరే శాసించేవారని చెప్పుకొంటారు. కాగా, జాకబ్ జుమా హయాంలో ప్రభుత్వ సంస్థల నుంచి భారీ మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేశారన్న ఆరోపణలతో గుప్తా సోదరులపై విచారణ చేపట్టారు. దీంతో 2018లో కుటుంబాలతో సహా వీరు దుబాయ్కి పారిపోయారు. దీంతో వీరిపై ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. ముగ్గురు గుప్తా సోదరుల్లో అజయ్ గుప్తా అరెస్టు అయ్యారో లేదో వివరాలు తెలియలేదు.