బీజింగ్: కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల పరిష్కారం పెద్ద సవాలు. అయితే దీనికి చాలా కచ్చితత్వంతో కేసులను పరిష్కరించేందుకు కృత్రిమ మేధ సాయపడనున్నది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ‘రోబో ప్రాసిక్యూటర్’ను చైనా రూపొందించింది. వెర్బల్ డిస్క్రిప్షన్ ఆధారంగా 97 శాతం కచ్చితత్వంతో కేసులను పరిష్కరిస్తుందని చెబుతున్నారు. షాంఘైలోని పుడాంగ్ పీపుల్స్ ప్రొక్యుటరేట్ దీన్ని రూపొందించినట్లు తెలుస్తున్నది. కొన్ని కోట్ల సంఖ్యలో సమాచారాన్ని విశ్లేషించి తీర్పు చెబుతుంది.