వాషింగ్టన్ : అమెరికాలోని మధ్య, దక్షిణాది రాష్ర్టాల నుంచి తూర్పు తీరం వరకు సోమవారం తీవ్రమైన మంచు తుఫాను, రక్తం గడ్డ కట్టే చలి జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్లపై మంచు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రయాణించాలంటే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేశారు. కెంటకీ, ఇండియానా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, ఇలినాయిస్, మిస్సోరీలలో సుమారు 3 లక్షల మంది విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.