Mark Zuckerberg | కాలిఫోర్నియా, ఫిబ్రవరి 21: మెదడు సంకేతాల్ని చదివే ఒక స్మార్ట్బ్యాండ్ను తీసుకొస్తున్నట్టు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ను అమర్చామన్న అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటన.. ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. తన చుట్టూ ఉండే సాంకేతిక పరికరాల్ని (కంప్యూటర్, మొబైల్..) నియంత్రించేందుకు ఎలాన్ మస్క్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు మూలం ‘న్యూరాల్ టెక్నాలజీ’.
నాడీ సంకేతాలను అర్థం చేసుకునే కంప్యూటర్ సాంకేతికత ఇది. జుకర్బర్గ్ కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ ‘న్యూరాల్ టెక్నాలజీ’ ప్రాజెక్ట్ను చేపట్టారు. ఆధునిక టెక్నాలజీతో మనిషి మెదడును అనుసంధానం చేసే ‘ఎలక్ట్రోమయోగ్రఫీ’ బ్యాండ్ను మరికొద్ది సంవత్సరాల్లో మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు.