న్యూఢిల్లీ: శరీరంలో షుగర్ ఎంతుంది, బీపీ ఎలా ఉంది, శరీర ఉష్ణోగ్రతను లెక్కించడంతో పాటు రక్తంలో ఆల్కహాల్ స్థాయిని కూడా ఎప్పటికప్పుడు తెలిపే అధునాతన బయోమెట్రిక్ సెన్సర్ను అమెరికాకు చెందిన రాక్లీ ఫొటోనిక్స్ అనే సంస్థ తయారు చేసింది. దీనిని ‘అరచేతిలో దవాఖాన’గా అభివర్ణించింది. సెన్సర్ను స్మార్ట్ వాచీల్లో అమర్చవచ్చు. ప్రస్తుతం సెన్సర్తో కూడిన చేతి గడియారాలను ఇంకా తయారు చేయలేదు. రిస్ట్ బ్యాండ్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే వాచీలను తయారు చేస్తామని సంస్థ చెప్పింది.