కాఠ్మండు, జూలై 11: పర్యాటకుల హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ఉన్న ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు మెక్సికోకు చెందినవాళ్లు (ఒకే కుటుంబానికి చెందినవాళ్లు) కాగా ఒకరు పైలట్. ఈ ఘటన మంగళవారం ఎవరెస్ట్ శిఖరం సమీపాన ఉన్న సొలుకుంభూ జిల్లాలో చోటుచేసుకున్నది.
హెలికాప్టర్ సుర్కే విమానాశ్రయం నుంచి కాఠ్మండుకు బయలుదేరిన నిమిషాల్లోనే కుప్పకూలింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. వాతావరణం అనుకూలించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.