సింగపూర్, ఆగస్టు 29: వివిధ రంగాల్లో నిష్ణాతులను ఆకర్షించే క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కొత్త వర్క్ వీసాను తీసుకురానున్నట్టు ప్రకటించింది. నెలకు కనీసం 30,000 సింగపూర్ డాలర్లు (రూ. 17.19 లక్షలు) సంపాదన కలిగిన వారు ఈ వీసా దరఖాస్తుకు అర్హులని వెల్లడించింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పాస్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్, క్రీడలు, సాంస్కృతిక, పరిశోధన రంగాల్లో నిపుణుల కొరతను పూడ్చడానికే ఈ స్కీమ్ తీసుకొస్తున్నట్టు తెలిపింది.