బీజింగ్ : ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ ‘జే హోటల్’ను చైనాలోని షాంఘైలో ప్రారంభించారు. ఇది ప్రఖ్యాత షాంఘై టవర్లో 120వ అంతస్తులో ఉన్నది. షాంఘై టవర్ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తై భవనం. 2 వేల అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించారు. మేఘాలను తాకుతూ ఉండే ఈ జే హోటల్లో 7 రెస్టారెంట్లు, బార్లు, స్పా, స్విమ్మింగ్ పూల్ వంటి వసతులు ఉన్నాయి. అందుకే ఈ హోటల్లో ఒక్క రోజు సాదాగా గడపాలంటే రోజుకు రూ.33,367 చెల్లించాల్సిందే. ఇక ప్రత్యేక వసతులు వాడుకోవడానికి ధర రూ.7.5 లక్షల పైమాటే.