ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఇవాళ ఆ దేశ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి తెలిపారు. మార్చి 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు దీనిపై చర్చ ఉంటుందన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ ఒకటి నుంచి 4వ తేదీ మధ్య ఓటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మూడు రోజుల కన్నా ముందు ఓటింగ్ నిర్వహించరాదు, అలాగే ఏడు రోజుల గడువు కూడా దాటరాదు.
పాకిస్థాన్ దిగువ సభ్యలో 342 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు అవిశ్వాసంలో నెగ్గాలంటే వారికి 172 సభ్యుల ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇమ్రాన్ కూటమిలో 178 మంది, ప్రతిపక్షాల కూటమిలో 163 మంది ఉన్నారు. గతంలో రెండు సార్లు పాకిస్థాన్ ప్రధానులపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెనర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్టగా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్రధాని షౌకాత్ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు.