పారిస్: పారిస్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఓ ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు. అక్కడ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. కత్తితో దాడి చేసిన అనుమానితుడిని పోలీసులు షూట్ చేశారు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేశారు. అయితే ఈ దాడిలో ఎంత మంది గాయపడ్డారన్న విషయాన్ని మంత్రి వెల్లడించలేదు.