లిమా: పెరూలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ తేలికపాటి విమానం నాజ్కాలోలో టేకాఫ్ అయిన కొద్దిసేటికే కూలిపోవడంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల (Nazca lines) పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా. నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఐదురగురు పర్యాటకులు, ఫైలట్, కోఫైలట్ ఉన్నట్లు తెలిపారు. ఆ విమానం ఏరో శాంటోస్ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు.
పెరూలో నాజ్కా లైన్లు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 1,500-2,000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్మక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడికి విదేశీ పర్యాటకుల కోసం మారియా రీచే ఎయిర్ ఫీల్డ్ నుంచి ప్రతిరోజు డజన్ల కొద్ది విమానాలను నడుపుతారు.
2010, అక్టోబర్లో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు బ్రిటిష్ పర్యాటకులు, ఇద్దరు పెరూవియన్ విమాన సిబ్బంది మరణించారు.