కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో భయానక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్ల నుంచి తప్పించుకొని దేశం వదిలి వెళ్లిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ ఎయిర్పోర్ట్కు తరలివస్తున్నారు. వాళ్లను నియంత్రించడానికి అక్కడ ఉన్న తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో తొక్కిసలాట జరిగిన ఏడుగురు మృతి చెందినట్లు బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. కాబూల్లో పరిస్థితి ఇప్పటికీ సవాలుగా ఉంది. అయితే సాధ్యమైనంత సురక్షితంగా ఉంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం అని ఒక ప్రకటనలో బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.
గత ఆదివారం ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత వేల మంది దేశాన్ని విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో ఎయిర్పోర్ట్కు తరలి వస్తున్న ఆఫ్ఘన్లను నియంత్రించడం అక్కడి భద్రతా దళాలకు సవాలుగా మారింది. దీనికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.