లండన్, జూన్ 5: లండన్లోని గ్లాస్గో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ చర్మాన్ని అభివృద్ధి చేశారు. మానవ చర్మానికి స్పర్శ ఉన్నట్టే ఈ చర్మానికి కూడా స్పర్శ జ్ఞానం ఉండటం దీని ప్రత్యేకత. కొట్టినప్పుడు, గిల్లినప్పుడు, ఏదైనా తగిలినప్పుడు మనకు ఎలా నొప్పి వేస్తుందో.. ఈ చర్మానికి కూడా నొప్పి తెలుస్తుంది.
భవిష్యత్తులో కొత్తతరం, స్మార్ట్ రోబోల తయారీలో ఈ ఎలక్ట్రానిక్ చర్మం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ చర్మాన్ని తయారు చేసిన బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రవీందర్ దహియా నేతృత్వం వహించారు.