న్యూఢిల్లీ: ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమి పైన కాదు.. భూలోతు పొరల్లో దాగి ఉన్నట్లు తేల్చారు. భూమిపై నీరే 70 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంక్ఫర్ట్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఎట్ గోతే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. భూమి అంతర్భాగంలో చాలా హెచ్చు స్థాయిలో నీరు ఉన్నట్లు స్టడీలో వెల్లడించారు. భూ ఉపరితలానికి సుమారు 660 కిలోమీటర్ల లోతులో ఆ నీరు ఉన్నట్లు గుర్తించారు. రామన్ స్పోక్ట్రోస్కోపీ, ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా ఆ సముద్రాన్ని పసికట్టారు. భూ ఉపరితలం, భూ లోపలి పొరల మధ్య ప్రాంతంలో కావాల్సినంత నీరు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ట్రాన్సిషన్ జోన్లో భారీ స్థాయిలో నీరు ఉన్నట్లు గుర్తించామని ప్రొఫెసర్ ఫ్రాంక్ బ్రెంకర్ తెలిపారు.