యెమెన్: వందల సంఖ్యలో శరణార్ధుల్ని(Migrants) సౌదీ దళాలు చంపినట్లు తెలుస్తోంది. యెమెన్ బోర్డర్ వద్ద సామూహిక హత్యలు జరిగినట్లు తాజాగా ఓ రిపోర్టు రిలీజైంది. మానవ హక్కుల సంస్థ దీనిపై నివేదికను విడుదల చేసింది. యెమెన్ దేశం మీదుగా సౌదీ ఆరేబియాకు వెళ్తున్న ఇథోపియాకు చెందిన వందలాది శరణార్థుల్ని సౌదీ దళాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అనేక సంఖ్యలో శరణార్థులు కాళ్లు పోగొట్టుకున్నారు. కానీ తమపై వస్తున్న ఆరోపణల్ని మాత్రం సౌదీ అరేబియా ఖండించింది. హ్యూమన్ రైట్స్ వాచ్(హెచ్ఆర్డబ్ల్యూ) తన రిపోర్టులో అనేక అంశాల్ని పొందుపరిచింది. యెమెన్ మీదుగా ప్రతి ఏడాది ఆఫ్రికా నుంచి సుమారు రెండు లక్షల మంది శరణార్థులు సౌదీ వెళ్తుంటారని యూఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.