Sanket Jayesh Balsara | వాషింగ్టన్, ఫిబ్రవరి 10: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్లోని తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ మూలాలున్న సంకేత్ జయేశ్ బల్సారా నియమితులయ్యారు. ఈ మేరకు వైట్హౌస్ ప్రకటన విడుదల చేసింది. ఇదే కోర్టులో 2017 నుంచి సంకేత్ జయేశ్ బల్సారా మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు.
ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా వాసిగా బల్సారా నిలిచారు. ఇప్పుడతనికి న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. భారత్, కెన్యాల నుంచి ఐదు దశాబ్దాల క్రితం సంకేత్ జయేశ్ కుటుంబం అమెరికాకు వలస పోయింది. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాల, నియంత్రణ వ్యవహారాల్లో నిపుణుడిగా సంకేత్ జయేశ్కు పేరున్నది.