కీవ్, సెప్టెంబర్ 17: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓటమి అంచునకు చేరుతున్నదా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. ఒక్కో నగరాన్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకొంటుండటమే అందుకు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మధ్యే ఖార్కీవ్కు 2 వేల కిలోమీటర్ల దూరం వరకు మాస్కో బలగాలను తరిమికొట్టిన కీవ్ సేనలు.. ఖేర్సన్పై దాడులను ఉధృతం చేశాయి.
దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని రష్యా సైన్యానికి సాయం అందకుండా చేశాయి. ఉక్రెయిన్ దూకుడును తట్టుకోలేక రష్యా బలగాలు ఒత్తిడిలోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్పై మిలిటరీ పరంగా, దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతున్నది. అటు.. రష్యాలోనూ పుతిన్ వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.