కీవ్, ఏప్రిల్ 24: ఉక్రెయిన్పై రష్యా మారణకాండ కొనసాగుతున్నది. పోర్టు నగరమైన ఒడెసాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో 27 ఏండ్ల ఓ తల్లితో పాటు ఆమె మూడు నెలల పాప ఉంది.
ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీవ్లో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. లోకం తెలియని పాపను కూడా పొట్టనపెట్టుకున్న రష్యా సైనికులలు ‘మురికి వెధవలు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియుపోల్లోని అజోవ్స్టాల్ ప్లాంట్ను చేజిక్కించుకునేందుకు రష్యా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్లోని పవ్లోహ్రాడ్ పట్టణ సమీపంలో ఉన్న పేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణశాఖ ప్రకటించింది.