రష్యా- ఉక్రెయిన్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్స్కీ మరణించినట్లు నెక్ట్సా మీడియా పేర్కొంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ను ఉక్రెయిన్ హతమార్చిందని నెక్ట్సా మీడియా పేర్కొంది. యుద్ధంలో ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా భారీగా నష్టపోయిందని పేర్కొంది. ఇక… 30 విమానాలు, 374 ఆటో మొబైల్ టెక్నిక్స్, 217 ట్యాంకులను రష్యా నష్టపోయిందని మీడియా పేర్కొంది.
ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా ప్రాధమిక డిమాండ్లనే ముందుంచిందని చెప్పారు. దేశ భద్రతకు సవాల్ విసిరేందుకు ఉక్రెయిన్ను రష్యా అనుమతించబోదని స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాల మధ్య తదుపరి దశ చర్చలు గురువారం సాయంత్రం జరుగుతాయని తెలిపారు.ఉక్రెయిన్, యూరప్ ప్రాంతానికి భద్రతా హామీలపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందని అన్నారు.