కీవ్: ఉక్రెయిన్పై రష్యా మిస్సైల్ దాడులను ముమ్మరం చేసింది. మంగళవారం ఏకంగా 100 మిస్సైల్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పొరుగునే ఉన్న పోలండ్లో రష్యా మిసైల్ పడింది. ఈ మిసైల్ దాడిలో పోలెండ్కు చెందిన ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని పోలండ్ ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది.
రష్యా ఫెడరేషన్కు చెందిన సాయుధ దళాలు ఉక్రెయిన్పై మరోసారి క్షిపణి దాడులు చేశాయని, ఈ క్రమంలోనే రష్యాకు చెందిన మిసైల్ ఒకటి పోలెండ్లోని హ్రూబిస్జో జిల్లా ర్జెవొడో గ్రామంపై పడిందని, ఈ ఘటనలో తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులు మరణించారని పోలండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దీనిపై వివరణ ఇవ్వాలని పోలెండ్లోని రష్యా అంబాసిడర్కు పోలండ్ సర్కారు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ ఘటనపై నాటో కూడా ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది.