Russia – Ukraine Conflict | ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై మూడో రోజు కూడా రష్యా బాంబుల వర్షం కొనసాగుతూనే ఉంది. ఆ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు స్థానికులు అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు ప్రాణాలకు తెగించి ప్రతిఘటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాను కీవ్ నుంచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. మా దేశాన్ని కాపాడుకుంటాం. మా ఆయుధాలనే నమ్ముకున్నాం. ఆయుధాలు వీడి లొంగిపోవాలంటూ సైన్యానికి నేను చెప్పినట్లుగా నకిలీ వార్తలు వస్తున్నాయి. వాటిని నమ్మవద్దు’ అని ప్రజలనుద్దేశించి ట్విట్టర్లో ఒక సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. కాగా, భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది.
ఉక్రెయిన్పై దండయాత్రకు శ్రీకారం చుట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించినా.. ఉక్రెయిన్ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్పై దాడులు తీవ్రతరం చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అన్ని వైపుల నుంచి దాడులు తీవ్రతరం చేయాలని స్పష్టం చేశారు.
రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఎదుర్కొనేందుకు పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి. నేరుగా కదన రంగంలోకి దిగకపోయినా పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్తోపాటు పలు దేశాలు ఆయుధాలను పంపిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఉక్రెయిన్కు అమెరికా కొత్తగా సహాయం ప్రకటించింది. రష్యాను ఎదుర్కొనేందుకు అదనంగా 350 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,627 కోట్లు) విలువైన సైనిక పరికరాలను అందిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శనివారం తెలిపారు. నేల, నింగితోపాటు ఇతర దాడుల ముప్పును ఉక్రెయిన్ ఎదుర్కొనేందుకు మూడో ప్యాకేజీ కింద అత్యాధునిక రక్షణ పరికరాలను అందజేస్తామని చెప్పారు.
రొమానియా నుంచి భారతీయులను తీసుకొచ్చిన తొలి విమానం ముంబై ఎయిర్ పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇందులో 219 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ముంబై ఎయిర్పోర్ట్కు సురక్షితంగా చేరుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ సైన్యం పాల్పడుతున్న దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యుద్ధం మూడో రోజుకు చేరగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా సైనిక దళాలు దూసుకెళ్తున్నాయి. అయితే రష్యాకు చెందిన ఒక ట్యాంక్ నిర్మాణుష్య ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న కారుపైకి వేగంగా దూసుకెళ్లింది. వెనక్కి వెళ్లి మరి దానిని బలంగా తొక్కేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని పార్లమెంట్ భవనానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగినట్లు స్కై న్యూస్ తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రష్యా సైనికుల దురాగతంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Za sve one koji ne žele da vide šta Putin radi u Ukrajini.
Ruski narod ne stoji iza ovoga. Ovo je Putinov lični rat.
Na obraz medjunarodnoj zajednici koja ovo nemo posmatra.#Ukraine pic.twitter.com/aqfhpMuX9A
— Balša Božović (@Balshone) February 25, 2022
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆ దేశ ప్రజలతోపాటు మీడియా సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రజల నిరసనలను రష్యా బలవంతంగా అణిచివేస్తున్నది. అలాగే ఉక్రెయిన్ యుద్ధ కవరేజీపై స్థానిక మీడియా సంస్థలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ సంస్థ రోస్కోమ్నాడ్జోర్, శనివారం పది స్థానిక మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్లో రష్యా చేపట్టిన ప్రత్యేక సైనిక చర్యకు సంబంధించిన సంఘటనలపై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని ఆరోపించింది. తప్పుడు సమాచార ప్రచురణ, ప్రసారాలను నిలిపివేయడంతోపాటు పాత వాటిని తొలగించకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని లేఖల ద్వారా హెచ్చరించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం ఫోన్ చేశారు. రష్యా బాంబుల మోత మోగిస్తూ.. ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో భారత్ సాయం కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీని కోరారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెలెన్స్కీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం శనివారానికి మూడో రోజుకు చేరింది. రాజధాని కీవ్ వైపు రష్యా దళాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. రష్యా సైనిక దళాలు కీవ్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలిపింది. అయితే రష్యా దళాలు ముందుకు సాగుతున్నప్పటికీ ఇంకా పైచేయి సాధించలేదని పేర్కొంది. ఉక్రెయిన్ ఎయిర్స్పేస్పై నియంత్రణను రష్యా ఇంకా తెచ్చుకోలేదని చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆశించినంతగా ఆ దేశ వైమానిక దళం ప్రభావాన్ని చూపలేకపోయినట్లు అభిప్రాయపడింది.
ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 219 మందితో రొమేనియా నుంచి భారత విమానం తిరుగుప్రయాణమైంది. మరో విమానాన్ని కూడా అధికారులు పంపనున్నారు. ఉక్రెయిన్లోని భారతీయులు క్షేమంగా తీసుకొస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. అయితే అక్కడి ఎంబసీ అధికారులు మాత్రం భారతీయులు మాత్రం అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది. తమ సూచనలు తీసుకోకుండా, వాటికి విరుద్ధంగా ఎవరూ ఏ దేశ సరిహద్దుల వైపు వెళ్లొద్దన స్పష్టం చేశారు. అక్కడి ఎంబసీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికాతోపాటు ఐరోపా యూనియన్ ఖండించింది. ఐరోపాలో బ్రిటన్ తర్వాత మరో ముఖ్య దేశమైన ఫ్రాన్స్, ఉక్రెయిన్కు తన సంఘీభావాన్ని వినూత్నంగా ప్రకటించింది. రాజధాని పారిస్లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులతో కాంతులీనింది. ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా నీలం, పసుపు రంగుల్లో ఈఫిల్ టవర్ వెలిగిపోయిందని పారిస్ మేయర్ అన్నే హిడాల్గో తెలిపారు. ఆ సమయంలో అక్కడున్న సందర్శకులు ఉక్రెయిన్ జాతీయ జెండా రంగుల్లో మెరిసిన ఈఫిల్ టవర్ను తిలకించి పులకించారు. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను హస్తగతం చేసుకోవాలనుకున్న రష్యా బలగాలను అడ్డుకున్నామని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ‘‘రష్యా బలగాలను మన మిలటరీ అడ్డుకుంది’’ అని ఆయన చెప్పారు. కీవ్ను స్వాధీనం చేసుకొని, తన అడ్డు తొలగించుకోవాలనుకున్న రష్యా బలగాల ఆశ నెరవేరలేదన్నారు. అలాగే తమ దేశంపై చోరబాటును ఆపాల్సిందిగా వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి చేయాలని రష్యా ప్రజలను కోరారు.
లక్ష మంది ఉక్రెయిన్ ప్రజలు వలస వెళ్లారు. దీంతో కార్లతో సహా పలు వాహనాల్లో వలస వెళ్లిపోతున్నారు. అయితే.. ఉక్రెయిన్ అధికారుల ప్రకారం ఇప్పటి వరకూ ఓ లక్ష మంది ఉక్రెయిన్ పౌరులు వలస వెళ్లిపోయారని పేర్కొంటున్నారు. రొమానియా, పోలాండ్, మోల్డోవా స్లోవాకియా హంగేరీ ప్రాంతాలకు తరిలిపోయారు. వీరి బాధ వర్ణనాతీతం. అంతర్జాతీయ శరణార్థుల ఏజెన్సీ ప్రకారం ఇప్పటి వరకూ ఓ లక్ష మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోయారని తెలుస్తోంది. పరిస్థితి ఇంకా క్షీణిస్తే మాత్రం ఈ సంఖ్య 40 లక్షలు దాటే ప్రమాదముందని ఆ సంస్థ పేర్కొంది.
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్టీ సీనియర్ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా భారత్ ఈ ఓటింగ్లో పాల్గొంటే బాగుండేదని మనీశ్ తివారీ ట్విట్టర్ వేదికగా సూచించారు.
ఉక్రెయిన్పై రష్యా తన భీకర దాడులను కొనసాగిస్తూనే వుంది. పలు కీలకమైన పట్టణాల్లో రష్యా జెండాను కూడా పాతేసింది. రాజధాని కీవ్తో పాటు ఖార్కిన్ వంటి కీలక నగరాల్లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. తాము చివరాఖరు ఊపిరి వరకూ పోరాడుతూనే వుంటామని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఈ సమయంలో ఉక్రెయిన్కు చెందిన కిరా రుడిక్ అనే ఎంపీ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్కు చెందిన ప్రతి పౌరుడూ… ఆడ, మగ అందరూ రష్యా చేస్తున్న దమనకాండను నిరసిస్తూ ఆయుధాలు పట్టుకోడానికి సిద్దంగా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది. ఆ ఎంపీ కలాష్నికోవ్ రైఫిల్తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
తాను కీవ్ నుంచి పారిపోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. తాను పోరిపోయినట్లు వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. ఆయుధాలు వీడేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నేను ఇక్కడే ఉన్నాను. మేము ఆయుధాలను వీడం. మా దేశాన్ని కాపాడుకుంటాం. మా ఆయుధాలనే నమ్ముకున్నాం. ఆయుధాలు వీడి లొంగిపోవాలంటూ సైన్యానికి నేను చెప్పినట్లుగా నకిలీ వార్తలు వస్తున్నాయి. వాటిని నమ్మవద్దు’ అని ప్రజలనుద్దేశించి అన్నారు.
కాగా, తాను అలసిపోయినట్లుగా కనిపిస్తున్నప్పటికీ చాలా దృఢనిశ్చయంతో ఉన్నానని జెలెన్స్కీ తెలిపారు. ‘ఇదే మా భూమి, మా దేశం, మా పిల్లలు… అన్నింటినీ మేం కాపాడుకుంటాం’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం మూడో రోజుకు చేరిన నేపథ్యంలో రష్యా దళాలు కీవ్లోకి దూసుకొస్తూ దాడులను తీవ్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాత్రి మనందరికీ కాళ రాత్రి అని జెలెన్స్కీ అన్నారు.
Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
అమెరికా విదేశీ వ్యవహారాల కౌన్సిల్ అధ్యక్షుడు రిచర్డ్ హాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్కు భారత్ భయపడిందంటూ అవమానించాడు.
‘రష్యా ఇలా బహిరంగంగా ఉక్రెయిన్ ఆక్రమణకు దిగింది. అయినా సరే భారత్ మాత్రం జాగ్రత్తగా ఉంది. పుతిన్కు కోపం తెప్పించకూడదనే భారత దేశం ఓటింగ్లో పాల్గొనలేదు. అంటే పెద్ద దేశాలకు ఉండే బాధ్యతలు నిర్వహించే సత్తా, ఆధారపడదగ్గ భాగస్వామిగా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా లేదనడానికి ఇదే నిదర్శనం. చైనా ఎదుగుదల కోణంలో చూసుకున్నా కూడా ఇది ముందు చూపు లేని నిర్ణయమే’’ అంటూ రిచర్డ్ విమర్శించారు.
దీనిపై జోహో సీఈవో శ్రీధర్ వేంబు స్పందించారు. ‘‘మిస్టర్ హాస్.. మీరు ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్లో మీ విదేశీ పాలసీల వైఫల్యాలను పట్టించుకోకుండా, మీకు మద్దతు పలకలేదని భారత్ను విమర్శించాలని అనుకుంటున్నారా? ఉక్రెయిన్కు మీరు అండగా ఉన్నామనే భ్రమ కల్పించింది మీ ప్రభుత్వం. అవసరమైన సమయంలో చేతులెత్తేసింది కూడా మీరే. ఇప్పుడు భారత్పై పడి ఏడుస్తారే?’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Mr. Haass, instead of looking at your own foreign policy failures in Afghanistan and Ukraine, you want to blame India for not loudly cheerleading your every disastrous mistake?
Your state department led Ukraine to believe America had her back and let her down. Why blame India? https://t.co/7JFYxskVkT
— Sridhar Vembu (@svembu) February 26, 2022
ఉక్రెయిన్లోని భారతీయులు దుర్భర పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్రం వెంటనే సురక్షితంగా భారత్కు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్లోని బంకర్లో ఉన్న కర్నాటక విద్యార్థులకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఈ విజువల్స్లో ఉన్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రష్యా టార్గెట్గా ఉన్న తూర్పు ఉక్రెయిన్లో చాలా మంది ఇరుక్కుపోయారు. మరో సారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ఇరుక్కున భారతీయులు, భారతీయ విద్యార్థులను వెంటనే భారత్కు తీసుకుండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
రష్యాకు చెందిన పలు సైనిక వాహనాలపై z గుర్తు ఉండటం అందర్నీ ఆకర్షిస్తోంది. ఓ వాహనంపై ఈ z గుర్తు ఓ స్థలంలో ఓ ఆకారంలో, మరో వాహనంపై ఇదే గుర్తు మరో ఆకారం, మరో స్థలంలో కనిపిస్తోంది. కానీ… z గుర్తు అన్ని వాహనాలకూ కనిపిస్తోంది. ఇదో రకమైన ఎర్రజెండా లాంటిదట. వీటిని రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. రష్యా జాతీయ భద్రతా దళం అని కూడా అంటుంటారు. వీరందరూ ఖైదీలను తీసుకెళ్లే ఎవ్టోజాక్స్ వాహనాల్లో వీరందరూ వెళ్తున్నారు. బెల్గోరోడ్ ప్రాంతంలోని ఈ వాహనాలను ఎప్పుడూ ఈ జెడ్ గుర్తును కలిగే వుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇంకో వాదన కూడా ఉంది. రష్యా సైనికులే రష్యా సైనికుల వాహనాలపై కాల్పులు జరపకుండా ఈ జెడ్ (z) గుర్తును వాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇదో రకమైన కమ్యూనికేషన్ సిగ్నల్స్ అని పేర్కొంటున్నారు. ఇక… కేవలం యుద్ధాల్లోనే వీటిని ఉపయోగిస్తారు అన్న మెసేజ్ కూడా ఇందులో ఉంటుందట. అధికారులకు కూడా సులభంగానే యుద్ధానికి ఉపయోగించే వాహనమేదో తెలిసిపోడానికి జెడ్ (z) అక్షరం రాస్తారట.
✊🏻Українець кидається під ворожу техніку, щоб окупанти не проїхали pic.twitter.com/cZ29kknqhB
— НВ (@tweetsNV) February 25, 2022
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మూడో రోజుకు చేరింది. రష్యా సైనిక దళాలు దాదాపుగా రాజధాని కీవ్ను సమీపించాయి. దీంతో ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా ప్రతిఘటిస్తున్నది. మరోవైపు ఉక్రెయిన్ పౌరులు కూడా తమ వంతు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు. శత్రు సైనికులపై దాడికి కొందరు తుపాకులు, ఆయుధాలు చేతపట్టారు. కాగా, ఒక వ్యక్తి ఒంటరిగా ఎలాంటి ఆయుధాలు లేకుండా రష్యా ట్యాంకులను నిలువరించేందుకు ప్రయత్నించాడు. కీవ్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు వాటి ముందుకు వచ్చి ధైర్యంగా నిల్చున్నాడు. అయితే రష్యా ట్యాంకులు అతడి నుంచి పక్కకు తొలగి ముందుకు దూసుకెళ్లాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. చాలా సుదీర్ఘమైన యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆ దేశ వార్షిక వ్యవసాయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానని, ఈ యుద్ధం ఇప్పట్లో ముగియదని అన్నారు. ఈ సంక్షోభం చాలా రోజులు ఉంటుందని, ఈ యుద్ధం చాన్నాళ్లు కొనసాగుతుందని, దానితో వచ్చే సంక్షోభ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని మాక్రన్ హెచ్చరించారు. నాటోలో కీలక దేశమైన ఫ్రాన్స్ ఇవాళ ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తున్నట్లు కూడా వెల్లడించింది.
ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు స్పెషల్ కారిడార్ను మూసివేశామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు చూపించాలని తెలిపారు. ఒక వేళ ఈ రెండు పత్రాలు చూపించని యెడల, అలాంటి విద్యార్థులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఆ ఖర్చు ఎయిర్పోర్టు అధికారులే భరిస్తారని చెప్పారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు. ఒక వేళ ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు వ్యక్తిని క్వారంటైన్లో ఉంచుతామని ప్రకటించారు.
రష్యా బలగాలతో తీవ్రమైన యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఉక్రెయిన్లో సాధారణ ప్రజానీకం నివశించే చాలా ప్రాంతాలపై రష్యా వేసే బాంబుల వర్షం కురిపిస్తోంది.రష్యా బలగాలతో తీవ్రమైన యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఉక్రెయిన్లో సాధారణ ప్రజానీకం నివశించే చాలా ప్రాంతాలపై రష్యా వేసే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆమె లైవ్ ప్రోగ్రాంలో రష్యా బలగాలు ఎక్కడెక్కడ బాంబులు వేశారో వివరిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తుండగా తమ ఇంటిపై కూడా బాంబులు వేసి ధ్వంసం చేశారని ఆమె గుర్తించింది. ‘‘నేనిది నమ్మలేకపోతున్నా. మేమంతా ఇక్కడే ఉండేవాళ్లం’’ అంటూ కన్నీరు పెట్టుకుంది ఓల్గా.
రష్యా చేస్తున్న దాడులతో 198 మంది ఉక్రేనియన్లు మృతిచెందినట్లు ఆ దేశానికి చెందిన ఆరోగ్యశాఖ మంత్రి విక్టర్ లియాష్కో వెల్లడించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్ పేజీలో లియాష్కో ఓ పోస్టు పెట్టారు. రష్యా దాడిలో ఇప్పటి వరకు 1115 మంది ఉక్రేనియన్లు గాయపడినట్లు తెలిపారు. మూడు రోజుల్లో 33 మంది చిన్నారులు కూడా గాయపడ్డారు. ఉక్రెయిన్ దళాలు చేస్తున్న ప్రతిఘటనతో రష్యా బలగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
యుద్ధ సమయాల్లో మాతృభూమిని కాపాడుకునేందుకు సైనికులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు. శత్రువును అడ్డుకునేందుకు ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడతారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారు. కొందరు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు. రష్యా ట్యాంకులు ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఒక ఉక్రెయిన్ సైనికుడు ఏకంగా బ్రిడ్డి వద్ద తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ఆ వంతెన కూలిపోవడంతో రష్యా ట్యాంకులు ముందుకు వెళ్లలేకపోయాయి.
భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బయల్దేరినట్లు ఆయన తెలిపారు. తమ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఉక్రెయిన్లోని పరిస్థితులను పరిశీలిస్తూ, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాను వ్యక్తిగతంగా ఉక్రెయిన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు జై శంకర్ వెల్లడించారు.
ఉక్రెయిన్ రాజధానిపై రష్యా తన మిస్సైళ్లతో దాడులు చేస్తూనే ఉంది. ఇవాళ తెల్లవారుజామున కీవ్ నగరంలో ఉన్న ఓ బహుళ అంతస్తు బిల్డింగ్పై రష్యా క్షిపణి దాడి చేసింది. మెరుపు వేగంతో వచ్చిన ఆ క్షిపణి.. భారీ బిల్డింగ్ను ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన వీడియో రిలీజైంది. ఆ వీడియోలో మిస్సైల్ దూసుకెళ్తున్న తీరు కనిపించింది. మిస్సైల్ ధాటికి బిల్డింగ్లోని కొన్ని అంతస్తులు దెబ్బతిన్నాయి. జులియానీ విమానాశ్రయం వద్ద ఉన్న ఈ అపార్ట్మెంట్పై దాడి జరిగింది. మిస్సైల్ ధాటికి అపార్ట్మెంట్లో ఉన్న అయిదు ఫ్లోర్లు దెబ్బతిన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ దాడిలో ఎంత మంది మరణించారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే కీవ్లో 35 మంది మరణించినట్లు తాజాగా ఆ నగర మేయర్ క్లిచ్కోవ్ తెలిపారు.
ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు చేయూతనిస్తున్నాయి. రష్యా దాడితో సతమతం అవుతున్న ఉక్రెయిన్కు ఫ్రాన్స్ ఆయుధాలను అందజేస్తోంది. ఆయుధాలతో పాటు సామాగ్రిని కూడా ఫ్రాన్స్ తరలిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్తో సంప్రదింపులు జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కొత్త తరహా దౌత్య రాజకీయం మొదలైనట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. యుద్ధానికి సన్నద్దం కావాలని మాక్రన్ కూడా ఓ వీడియోను పోస్టు చేశారు. కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కోవ్ ఇవాళ ఓ సమాచారాన్ని షేర్ చేశారు. ఆ నగరంలో జరుగుతున్న పోరులో 35 మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం కీవ్లో రష్యా దళాలు ఏమీ లేవన్నారు.
చర్చల ప్రతిపాదనపై ఇరు పక్షాలు సానుకూలంగా ఉన్నా మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ రాజధానిలోని రెసిడెన్షియల్ హైరైజ్ అపార్ట్మెంట్పై రష్యా మిసైల్ దూసుకొచ్చిందని ఎమర్జెన్సీ సేవల విభాగం శనివారం వెల్లడించింది. రష్యన్ సేనల దాడిని ఉక్రెయిన్ బలగాలు నిలువరిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి కీవ్లోని అపార్ట్మెంట్ బ్లాక్పై క్షిపణి దాడి జరిగిందని అత్యవసర సేవల విభాగం వెల్లడించింది.
ఉక్రెయిన్లో ఉన్న ఏపీ వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇందుకుగాను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ రంగంలోకి దిగింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని కృష్ణబాబు తెలిపారు. మ్యాపింగ్ చేసిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామని వెల్లడించారు. ఈరోజు 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారమివ్వగా ఇందులో ఏపీకి చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించామని స్పష్టం చేశారు. ఆంధ్రుల కోసం ఢిల్లీ ఎయిర్పోర్టులో ఏపీ భవన్ తరఫున హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు
రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు జెలెన్స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ సెర్గే నికిఫరోవ్ తెలిపారు. కాల్పుల విరమణకు కూడా జెలెన్స్కీ ఆమోదం తెలిపినట్లు సెర్గే చెప్పారు. చర్చలను తిరస్కరించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని, శాంతి, కాల్పుల విరమరణ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని, ఇదే మా శాశ్వత సిద్ధాంతమని, రష్యా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను తాము అంగీకరిస్తున్నామని తన ఫేస్బుక్ పేజీలో సెర్గే తెలిపారు.
మెలిటోపోల్ నగరాన్ని సంపూర్ణంగా చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్పై రణభేరి మోగించిన రష్యా.. మూడవ రోజు కూడా తన దాడుల్ని కొనసాగిస్తోంది. దక్షిణ ప్రాంతమైన జపోరిజ్యాలో ఉన్న మెలిటోపోల్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. మెలిటోపోల్ నగరాన్ని సంపూర్ణంగా చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్పై రణభేరి మోగించిన రష్యా.. మూడవ రోజు కూడా తన దాడుల్ని కొనసాగిస్తోంది. దక్షిణ ప్రాంతమైన జపోరిజ్యాలో ఉన్న మెలిటోపోల్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యాకు కూడా భారీ నష్టమే జరిగింది. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తన ఫేస్బుక్ పేజీలో అప్డేట్ చేసింది. మరో 200 మంది రష్యా సైనికుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. దీనికి తోడు 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్లను కూడా రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ సమాచారాన్ని ఎవరూ ద్రువీకరించలేదు. ప్రస్తుతం జరుగుతున్న దాడిలో మృతులకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు రష్యా వెల్లడించలేదు.
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా విమానంలో భారత్కు విద్యార్థులను తరలించనున్నారు. ఈ విమానం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకోనుంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా ఆఫర్ ఇచ్చింది. మరో దేశానికి తరలించేందుకు అమెరికా ఆయనకు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్ను జెలెన్స్కీ తిరస్కరించినట్లు ఉక్రెయిన్ మీడియా పేర్కొన్నది. ప్రస్తుతం కీవ్ నగరంలోనే ఉన్నట్లు జెలెన్స్కీ తాజా వీడియోలో తెలిపారు.
కీవ్పై కన్నేసిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ రాజధాని సరిహద్దుల్లోకి ప్రవేశించిన రష్యా దళాలకు స్థానిక ఆర్మీ ముచ్చమటలు పట్టిస్తోంది. రష్యా భీకర దాడులు చేస్తున్నా.. తమ ఆర్మీ ధీటుగా బదులు ఇస్తోందని ఉక్రెయిన్ మిలిటరీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. సిటీలోని ఓ ప్రధాన వీధి వద్ద రష్యా బలగాలను తమ ఆర్మీ యూనిట్ వెనక్కి వెళ్లేలా చేసినట్లు ఎఫ్బీ పేజీలో ఉక్రెయిన్ సైన్యం పేర్కొన్నది. వీధుల్లో భీకర స్థాయిలో పోరాటం జరుగుతోందని, ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని కీవ్ నగర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
మూడవ రోజు కూడా కీవ్ నగరంపై బాంబుల వర్షం కొనసాగుతూనే ఉన్నది. ఆ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు స్థానికులు అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేషన్లే ఇప్పుడు బాంబు షెల్టర్లు. అక్కడ తలదాచుకుంటున్న ఓ గర్భిణి ప్రసవించింది. బేబీకి జన్మనిచ్చినట్లు టెటిగ్రామ్ యాప్లో కొందరు ఈ విషయాన్ని షేర్ చేశారు.
ఉక్రెయిన్పై రష్యా దాడి కొనసాగుతున్నది. బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్లో (Kyiv) ప్రవేశించాయి. అయితే ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటించడంతో క్షిపణి దాడులకు పాల్పడుతున్నది. దీంతో కీవ్ దక్షిణ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నది. ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతుండంతో ఆ ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. కాగా, ప్యారా ట్రూపర్స్ సాయంతో రష్యా విమానాన్ని పేల్చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
ఉక్రెయిన్లో రష్యా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్నది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. అయితే మొదటి నుంచి ఉక్రెయిన్-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. కాగా, భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది.
ఉక్రెయిన్పై దాడుల సమయంలో రష్యాపై సైబర్ దాడి జరిగింది. రక్షణ, హోంమంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ వార్త సంస్థకు చెందిన వెబ్సైట్లను హ్యాకింగ్ చేశారు. అయితే ఈ సైబర్ దాడులను అమెరికానే చేసినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, భారత్, చైనా, జపాన్తో పాటు పలుదేశాలకు చెందిన రిసెర్చ్ సంస్థల వెబ్సైట్లను కూడా అమెరికా సంస్థ హ్యాంకింగ్ చేసిందని చైనాలోని బీజింగ్కి చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.
నాటో కూటమిలో చేరబోమని, ఈ విషయంలో తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ ప్రకటిస్తే చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు ఉక్రెయిన్ ఒప్పుకోగానే కొత్త ఎత్తు వేశారు. ఉక్రెయిన్ అధికార పగ్గాలను ఆ దేశ సైన్యం చేపట్టాలని సూచించారు. అప్పుడే శాంతి ఒప్పందానికి మార్గం సుగమం అవుతుందని కొత్త మెలిక పెట్టారు. ఈ మేరకు శుక్రవారం రష్యా భద్రతా మండలిలో ప్రసంగించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి రష్యా సైనిక దళాలు చొచ్చుకొస్తున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరోసారి చర్చల ప్రతిపాదన చేశారు. మరణాలను ఆపుదామని కోరారు. ‘రష్యా అధ్యక్షుడితో మాట్లాడాలని నేను మరోసారి భావిస్తున్నాను. ఉక్రెయిన్ అంతటా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రజల మరణాలను ఆపడానికి కూర్చొని చర్చించుకుందాం’ అని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కీవ్లో నాయకత్వాన్ని తొలగించి అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి’ అని ఉక్రెయిన్ ఆర్మీకి పిలుపునిచ్చారు. ఆ దేశ పాలకులను ఉగ్రవాదులుగా, నియో-నాజీలుగా, డ్రగ్స్కు బానిసలుగా ఆయన అభివర్ణించారు.
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలపై రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ చీఫ్ మండిపడ్డారు. అమెరికా కొత్తగా విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)పై ఇరు దేశాల సహకారం దెబ్బతినే అవకాశమున్నదని అన్నారు. దీని వల్ల స్పేస్ స్టేషన్ నియంత్రణ కోల్పోతే అమెరికా, ఐరోపా, భారత్, చైనా వంటి దేశాలపై అది పడవచ్చని హెచ్చరించారు. రష్యాపై ఐఎస్ఎస్ తిరుగదని, అందువల్ల తమ దేశానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని మొఘల్పురకు చెందిన సయ్యద్ ఖదీర్ కుమారుడు సయ్యద్ ఖాలీద్ ఒమన్, సయ్యద్ ఈషాన్ కుమార్తె సహెర్ ఫాతీమా ఇద్దరు ఉక్రెయిన్లోని ఇవానో ఫ్రాన్కివిస్క్ అనే సిటీలో ఉన్న ఇవానో ఫ్రాన్కివిస్క్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. రష్యా ఉక్రెయిన్పై దాడులు నిర్వహిస్తుండడంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు అక్కడికి వెళ్లిన విద్యార్థులు అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధ భేరిని మోగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి పట్టణంలోని మొఘల్పురకు చెందిన సయ్యద్ ఖదీర్ కుమారుడు సయ్యద్ ఖాలీద్ ఒమన్, సయ్యద్ ఈషాన్ కుమార్తె సహెర్ ఫాతీమా ఇద్దరు ఉక్రెయిన్లోని ఇవానో ఫ్రాన్కివిస్క్ అనే సిటీలో ఉన్న ఇవానో ఫ్రాన్కివిస్క్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. రష్యా ఉక్రెయిన్పై దాడులు నిర్వహిస్తుండడంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా బలగాలు భారీగా యుద్ధ ట్యాంకులను, బలగాలను మోహరించాయి. రష్యా గెరిల్లా ఫోర్స్తో దాడి చేస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా బలగాలు కీవ్ ఎయిర్పోర్టును స్వాధీనం చేసుకున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఐరోపా యూనియన్ (ఈయూ) ఆస్తులను ఫ్రీజ్ చేసేందుకు ఈయూ సన్నద్ధమైంది. ఉక్రెయిన్పై మాస్కో అణిచివేతకు నిరసనగా ఈయూ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రష్యా ఎయిర్లైన్స్పై ఈయూ నిషేధం విధించింది. ఆ దేశం నుంచి హైటెక్ రిఫైనరీ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేసింది.
యూకే బ్యాంకుల్లో రష్యన్ల డిపాజిట్లకు పరిమితులు విధించింది. రష్యాతో వాణిజ్య బంధాలపై పునరాలోచన చేస్తామని అమెరికా, యూరప్ ప్రకటించాయి.
రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమంటూ రష్యా చేసిన ప్రకటనపై స్పందించిన ఉక్రెయిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చిస్తామని తెలిపింది.
ఉక్రెయిన్పై తాము చేపట్టిన సైనిక చర్యపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత్ మద్దతును ఆశిస్తున్నామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితికి దారితీసిన కారణాలపై భారత్కు లోతైన అవగాహన ఉందని పేర్కొంది. రెండు దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భారత్ నిరంతర మద్దతును రష్యా కోరుతున్నదని భారత్లోని రష్యా సీనియర్ దౌత్యాధికారి రోమన్ బాబుష్కిన్ తెలిపారు.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రభావం కేవలం ముడి చమురు, సహజవాయువుకే పరిమితం కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. ఇతర నిత్యావసరాలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్లు మొదలు హైబ్రీడ్ కార్లు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఆభరణాల ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే వీటిలో వాడే పల్లాడియం అత్యధికంగా ఉక్రెయిన్లోనే ఉత్పత్తి అవ్వడమే దీనికి కారణం.
సృజన్-తాండూరు
గడ్డం మేధా, ముప్పవరపు వినయ్,
నిజాముద్దీన్-నిజామాబాద్
పూజ, ఇందిర-ఖమ్మం (ఒక్క ఉమ్మడి ఖమ్మం నుంచే 12 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నట్టు సమాచారం. అయితే ఇంకా వివరాలు తెలియలేదు).
సుమాంజలి-కరీంనగర్
షాబాద్-పబ్బ సాయితరుణ్.
వినోద్కుమార్, అభిషేక్, నిఖిల్, వికాస్-పాలమూరు
గోవర్ధన్, ఉదయ్ వసంత్, బర్ల రోహిత్ -జోగుళాంబ గద్వాల
మీర్జా అష్రఫ్-మహబూబ్నగర్
గంజి భాను ప్రసాద్, శేష ఫణిచంద్ర -యాదాద్రి భువనగిరి
పెరుమాళ్ల అజయ్- నల్లగొండ