అగ్రరాజ్యం అమెరికాపై రష్యా రాయబారి అనాటలీ ఆంటోనోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దళాలు యుద్ధనేరాలకు పాల్పడుతున్నాయంటూ అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్) ప్రతినిధి జాన్ కిర్బీ అనడాన్ని అనాటలీ తప్పుబట్టారు.
ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికా, నాటోలోని దాని మిత్రదేశాల దళాలు యుగోస్లేవియా, ఇరాక్, లిబియాల్లో చేసిన దాడులను వాళ్లు మర్చిపోయినట్లు అనిపిస్తోందని అనాటలీ విమర్శించారు. ‘‘కొంత కాలం క్రితం అమెరికా, నాటో దళాలు యుగోస్లేవియా, ఇరాక్, లిబియాల్లో లైవ్ టీవీ బ్రాడ్కాస్టుల్లోనే బాంబు దాడులు చేసిన ఘటనలన్నీ మర్చిపోయినట్లు అనిపిస్తోంది.
అమెరికా దళాలు, వారి మెర్సనరీలు ఆఫ్ఘనిస్తాన్, సిరియాల్లో చేసిన భయంకరమైన నేరాలు కూడా అమెరికా ప్రభుత్వానికి గుర్తు ఉన్నట్లు లేవు’’ అని రష్యన్ డిప్లొమాటిక్ మిషన్కు చెందిన టెలిగ్రాం ఛానెల్లో మాట్లాడారు. అదే సమయంలో రష్యా దళాలు ఉక్రెయిన్లోని మిలటరీ స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.