కీవ్: రష్యా ఎనర్జీ టెర్రరిజానికి పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఎనర్జీ నెట్వర్క్ను అటాక్ చేయడం వల్ల ఉక్రెయిన్లో దాదాపు 45 లక్షల మంది అంధకారంలోకి ఉండిపోయినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లోని విద్యుత్తు కేంద్రాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో రష్యా దాడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఖేర్సన్ సిటీ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరిస్తున్నట్లు తెలుస్తోంది.
గడిచిన నెల రోజుల్లోనే దేశంలోని మూడవ వంత పవర్ స్టేషన్లను రష్యా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని జెలెన్స్కీ వెల్లడించారు. విద్యుత్తు కేంద్రాలను టార్గెట్ చేయడం వల్ల .. ఆచితూచి విద్యుత్తును వాడాలని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజల్ని కోరింది. ఫ్రంట్లైన్లో రష్యా దళాలు ముందుకు కదలలేకపోతున్నాయని, అందుకే ఆ దళాలు ఎనర్జీ కేంద్రాలను టార్గెట్ చేస్తున్నాయని జెలెన్స్కీ ఆరోపించారు. ఎనర్జీ టెర్రరిజానికి పాల్పడుతున్న రష్యా .. అది ఆ దేశ బలహీనతను చూపిస్తోందని అన్నారు.
యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ను రష్యా ఓడించలేదని, అందుకే మన ప్రజల్ని ఇలా ఇబ్బందులు పెడుతున్నారని జెలెన్స్కీ అన్నారు.