షాంఘై : షాంఘై సహకార సంస్థ మీటింగ్(SCO Summit)కు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. తియాంజిన్లో జరుగుతున్న ఆ సమావేశాలకు ఇద్దరూ వెళ్లారు. అయితే ఒకే కారులో ఆ ఇద్దరు నేతలు కలిసి వెళ్లారు. కారు వెనుక సీటులో కూర్చున్న ఆ ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఎస్సీవో శిఖరాగ సదస్సు జరుగుతున్న వేదిక వద్ద.. మోదీ, పుతిన్లకు .. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్వాగతం పలికారు. ముగ్గురు టాప్ నేతలు కాసేపు పలకరించుకున్నారు. షాంఘై మీటింగ్ వద్ద ముగ్గురు నేతలు కలిసి మాట్లాడుతున్న వీడియోను రష్యా విదేశాంగ శాఖ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. వీడియో ఆఫ్ ద డే అని ఆ పోస్టుకు ట్యాగ్లైన్ ఇచ్చింది.
🇷🇺🇮🇳🇨🇳 President of Russia Vladimir Putin, Prime Minister of India Narendra Modi, and President of China Xi Jinping just before the start of the #SCO Summit
📹 © https://t.co/1iwVtSG6SN pic.twitter.com/o1rqQWYhT7
— MFA Russia 🇷🇺 (@mfa_russia) September 1, 2025
సుమారు 20 మంది దేశాధినేతలు ఎస్సీవో సమావేశంలో పాల్గొంటున్నారు. మరో పది అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా భేటీకి హాజరవుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలపై ప్రపంచ నేతలు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు, రవాణా, ఇంధనం, డిజిటైజేషన్, ఏఐ, గ్రీన్ డెవలప్మెంట్ అంశాలపై ప్రపంచ నేతలు మాట్లాడుకోనున్నారు.