కీవ్: ఉక్రెయిన్పై రష్యా (Russia) మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ భూభాగాలపై శుక్రవారం 70కిపైగా మిస్సైల్స్ను ప్రయోగించింది. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో దేశంలో రెండో అతిపెద్దదైన, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్ అంధకారంలో చిక్కుకున్నది. కీవ్, ఖేర్సన్, ఖార్కివ్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు వెల్లడించారు. క్రైవీ రిహ్లోని ఓ అపార్ట్మెంట్పై క్షిపణి పడటంతో ముగ్గురు, ఖేర్సన్లో మరొకరు మరణించారని తెలిపారు.
తమపై దాడిచేయడానికి రష్యా భారీ సంఖ్యలో మిస్సైళ్లను సిద్ధంచేసుకున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్స్కీ అన్నారు. ఈనేపథ్యంలో పాశ్చాత్య దేశాలు కీవ్కు మరింత సమర్ధవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అందించాలని కోరారు. రష్యా దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.