మాస్కో : టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సమావేశం కానున్న కొద్ది గంటల ముందు ఉక్రెయిన్ అతిపెద్ద ధాన్యం ఎగుమతి పోర్ట్లపై డ్రోన్ దాడులతో (Drone Attack) రష్యా విరుచుకుపడింది. ఒడెసా ప్రాంతంలోని డానుబే నదిపై నిర్మించిన ఉక్రెయిన్లోని కీలక ధాన్యం ఎగుమతి టెర్మినల్స్లో ఒకటైన ఇజ్మాయిల్ పోర్ట్ నివాసితులు డ్రోన్ దాడులతో భీతిల్లి వైమానిక దళం రక్షణ కావాలని కోరారు.
దక్షిణ ప్రాంతంలో 17 డ్రోన్లను కూల్చివేశారని ఒడెసా గవర్నర్ ఓలీ కైపర్ వెల్లడించారు. రష్యా డ్రోన్ దాడులతో పోర్ట్ మౌలికసదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇజ్మాయిల్ జిల్లాలోని పలు గోదాములు, భవనాలు, వ్యవసాయ యంత్రాలు, పారిశ్రామిక వాడలపై డ్రోన్ దాడులతో భారీ నష్టం వాటిల్లిందిన.
ఉక్రెయిన్ నుంచి ధాన్యాల ఎగుమతులపై ఎర్దోగన్, పుతిన్ల మధ్య కొద్దిసేపటిలో చర్చలు ప్రారంభం కానుండగా ఉక్రెయిన్లో అతిపెద్ద ధాన్యం ఎగుమతి పోర్టులపై రష్యా డ్రోన్ దాడులకు తెగబడటం కలకలం రేపింది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరిగిన వివరాలు వెల్లడికాలేదు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా ప్రాంతాల్లో నెలకొన్న ఆహార సంక్షోభం నేపధ్యంలో ఉక్రెయిన్ నుంచి ధాన్యాల ఎగుమతిపై టర్కీ, రష్యాలు చర్చించనున్నాయి.
Read More :