హైదరాబాద్: యుద్ధభూమి ఉక్రెయిన్లో రష్యా (Russia) మరోసారి కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించింది. దేశంలోని ఐదు నగరాల్లో పౌరుల తరలింపునకు అనువుగా తాత్కాలికంగా కాల్పులను నిలిపివేస్తున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం 7 గంటల (భారత కాలమానం ప్రకారం) నుంచి ఖార్కివ్, మరియుపోల్, జెపొరిజియా, సుమి, కీవ్, చర్నిహివ్ నగరాల్లో కాల్పులను విరమిస్తున్నట్లు తెలిపింది. హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. కాగా, ఉక్రెయిన్లో రష్యా దాడులు 14వ రోజుకు చేరాయి.
మంగళవారం ఉదయం 10 గంటల (రష్యా కాలమానం ప్రకారం) నుంచి ఐదు నగరాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. రాజధాని కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మరియుపోల్ నగరాల్లో కాల్పులకు విరామం పలికింది. అయితే మరియుపోల్లో రెండు సార్లు పౌరుల తరలింపునకు ఆటకం కలిగింది. కాల్పులను నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించినప్పటికీ అక్కడ దాడులు జరపడంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది.