మాస్కో, జూన్ 9: ఉక్రెయిన్లోని ఖకోవ్కా ఆనకట్ట కూల్చివేత, మాస్కోపై క్షిపణుల దాడుల కారణంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఉద్రిక్తంగా మారింది. దీనికి మరింత ఆజ్యం పోసే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ప్రకటన చేశారు. జులై 7-8 తేదీల్లో బెలారస్లో అణ్వాయుధాలను మోహరిస్తామని వెల్లడించారు.
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో పుతిన్ శుక్రవారం సమావేశమయ్యారు. ‘ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ప్రతిదీ స్థిరంగా ఉంది’ అని సమావేశం అనంతరం పుతిన్ ప్రకటన చేశారు. రష్యా అధీనంలో ఉండే భూ ఉపరితలం నుంచి సల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే అణ్వస్త్ర క్షిపణులను బెలారస్లో మోహరించాలని గతంలోనే ఇద్దరు దేశాధ్యక్షులు నిర్ణయించారు.