లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak)పై విమర్శలు వస్తున్నాయి. ఆయన విదేశీ టూర్ల(Foreign trips) కోసం సుమారు 5 లక్షల యూరోలు(Euros) ఖర్చు అయినట్లు లిబరల్స్ పార్టీ ఆరోపిస్తున్నది. ప్రైవేటు విమానాల్లో వెళ్లడం వల్లే ఆ ఖర్చు అయినట్లు ఆరోపించారు. పన్నుదారుల డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ పేర్కొన్నది.
గత ఏడాది నవంబర్లో ఈజిప్టు(Egypt)లో జరిగిన కాప్27 సదస్సుకు రిషి సునాక్ వెళ్లారు. అయితే ఆ ట్రిప్కు లక్షా 8 వేల యూరోలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సుకు వెళ్లినందుకు 3 లక్షల 40 వేల యూరోలు ఖర్చు అయ్యింది.
ఇక లాత్వియా, ఇస్టోనియా పర్యటన సమయంలో 62 వేల యూరోలు ఖర్చు అయింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పన్నుదారుల(taxpayers) డబ్బును వృధా చేసినట్లు లిబర్ డెమోక్రాట్లు ఆరోపించారు.