ప్రస్తుతం బ్రిటన్లో ప్రధాని పదవి కోసం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఇటీవల రిషి మాట్లాడుతూ.. తను యూకే ప్రధాని అయితే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రస్తుతం దేశానికి చైనానే ప్రధాన శత్రువని చెప్పిన రిషి.. యూకే జాతీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నుంచి ముప్పు ఉందని పేర్కొన్నారు.
ఇటీవల ఇదే విషయంపై ఒక ప్రతిపాదన చేసిన రిషి.. చైనా గూఢచారులను ఎదుర్కోవడానికి యూకే గూఢచార వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, దేశంలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లను కూడా పూర్తిగా మూసేయాలని సూచించాడు.
కాగా, భారత బిలియనీర్ ఇన్ఫోసిస్ నారాయణ దంపతుల అల్లుడే రిషి సునాక్. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత తదుపరి ప్రధాని కోసం ఇటీవల కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తొలి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.