Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా నిలిచారు. ఈ క్రమంలోనే రిషి… ఇవాళ బ్రిటన్ తదుపరి ప్రధానికి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో రిషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు రిషి గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్ షేర్ చేసిన రిషి సునాక్ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో భారత్ పర్యటనకు వచ్చిన రిషి సునాక్.. బెంగళూరులోని ప్రముఖ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ను సందర్శించారు. అక్కడ దక్షిణాది ఫుడ్ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సదరు రెస్టారెంట్ తాజాగా ట్విటర్ ద్వారా షేర్ చేసింది. బ్రిటన్ ప్రధానిగా రిషి ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ ఫొటో ఎప్పటిదన్న విషయం సదరు రెస్టారెంట్ తెలపలేదు.
#RishiSunak is going to become the next PM of UK.
Happy to know that he will be the first Indian-origin & the youngest British Prime Minister.
We wish him good luck & may he become the most successful PM of UK by sailing through all the turbulence pic.twitter.com/JhWLtcVTu2— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) October 24, 2022