జెరుసలాం: ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో(Israeli Strikes).. రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టు మృతిచెందాడు. దక్షిణ లెబనాన్పై జరిగిన దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇజ్రాయిల్ దిశ నుంచి వచ్చిన మిస్సైల్ వల్ల వాళ్లు గాయపడ్డారు. అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్పీ)కు చెందిన జర్నలిస్టులు అల్మా అల్ సాహెబ్ ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో మిస్సైల్ అటాక్ జరిగింది. ఇజ్రాయిల్ బోర్డర్ వద్ద ఆ దేశ మిలిటరీతో పాటు లెబనీస్ మిలిటరీ హిజ్బుల్లా కాల్పులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. జర్నలిస్టు మృతికి ఇజ్రాయిల్ కారణమని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ఆరోపించారు.