లండన్, డిసెంబర్ 17: అంతరిక్షంలో మార్పులు, ముఖ్యంగా సౌర తుఫానులు భూమిపై రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఇంగ్లండ్ పరిశోధకులు కనుగొన్నారు. బలమైన సౌర తుఫానులతో భూ అయస్కాంత శక్తిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, రైల్వే సిగ్నలింగ్లో రెడ్ సిగ్నల్కు బదులు గ్రీన్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్కు బదులు రెడ్ సిగ్నల్కు మారుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఇది రైలు ప్రమాదాలకు దారితీస్తున్నదని లాంకాస్టర్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. భూమిపై విద్యుత్తు సరఫరాలో ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయని తేల్చారు. ‘కొన్ని దశాబ్దాలకొకసారి అంతరిక్ష వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. శతాబ్దంలో ఒకటి, రెండు సార్లు ఇవి తీవ్రంగా ఉంటాయి. ఇవి భూమిపై రైల్వే భద్రత, సిగ్నల్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి’ అని పరిశోధకుడు ప్యాటర్సన్ అన్నారు.