డబ్లిన్, మార్చి 5: కొవిడ్ సమయంలో పుట్టిన పిల్లల్లో జీవపరమైన మార్పులు చో టు చేసుకున్నాయని ఐర్లాండ్కు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఐర్లాండ్లోని కాలేజ్ కార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.. కొవిడ్ వేగంగా వ్యాప్తి చెం దిన 2020 మార్చి నుంచి మే నెల మధ్య జన్మించిన 351 మంది మల నమూనాల పై అధ్యయనం జరిపారు.
కొవిడ్ వేళ జ న్మించిన శిశువుల్లో గట్ బ్యాక్టీరియాలో మార్పులు వచ్చాయని గుర్తించారు. కొవిడ్కు ముందు జన్మించిన పిల్లల్లో ఏడాది వయసు వచ్చే నాటికి 22.8 శాతం మంది లో ఫుడ్ అలర్జీలు కనిపించగా, కొవిడ్ సమయంలో పుట్టిన పిల్లల్లో మాత్రం కేవలం ఐదు శాతం మందికే ఫుడ్ అలర్జీలు కలిగినట్టు తేల్చారు.