అంకారా: తుర్కియే భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య 34 వేలు దాటింది. అయితే భారీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు రక్షిస్తున్నాయి. ఇక హయట్ ప్రావిన్సులో దాదాపు 175 గంటల తర్వాత శిథిలాల కింద ఉన్న ఓ మహిళను ప్రాణాలతో రక్షించారు. వారం రోజుల తర్వాత కూడా ఆమె శిథిలాల కింద సజీవంగా ఉంది. మహిళను రక్షించిన వీడియోను ఇస్తాంబుల్ మున్సిపాలిటీ రిలీజ్ చేసింది. ఆమెను నైదీ ఉమేగా గుర్తించారు. కాంక్రీట్ శిథిలాల కింద ఉన్న ఆమెను స్ట్రెచర్పై తీసుకెళ్లారు.
ఇస్తాంబుల్ ఫైర్ డిపార్ట్మెంట్, తుర్కిస్ మైనర్లు ఆ రెస్క్యూ బృందంలో ఉన్నారు. ప్రస్తుతం తుర్కియే భూకంపం ప్రాంతంలో భీకర స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
హటాయ్ ప్రావిన్సులోని అంటక్యా ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 167 గంటల తర్వాత రక్షించారు. ఓ 55 ఏళ్ల మహిళను దాదాపు 159 గంటల తర్వాత కాపాడారు. 85 ఏళ్ల మహిళను 152 గంటల తర్వాత రెస్క్యూ చేశారు.