టెక్సాస్, జూలై 25: ఒక చిన్న పురుగు ఒక వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. అమెరికాలో టెక్సాస్కు చెందిన మైఖేల్ కోహ్లాహఫ్ను గుమ్మడి పురుగు కాటేయగా, విషజ్వరంబారిన పడ్డాడు. శరీరంలో పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకింది. దీనిని ఆపడానికి చేతులు, కాలి వేళ్లు, పాదం తొలగించగా బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. మరో 48 గంటలు ఆగి ఉంటే అతని ప్రాణాలే పోయి ఉండేవని వారు చెప్పారు.