కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అస్తిరత కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో లంకలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాటికి అనుగుణంగా ప్రయాణాలు, పనులు చేసుకోవాలని తెలిపింది. అవసరమైతే తమను సంప్రదించాలని సూచించింది.
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేడు దేశ నూతన అధ్యక్షుడితోపాటు ప్రధానిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన పాలకుల పట్ల ప్రజలు ఏవిధంగా స్పందిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దీంతో శ్రీలంకలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, తాజా పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాలు పెట్టుకోవాలని, దానికి తగినట్లుగానే కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ సూచించింది.
Amid the current situation in Sri Lanka, Indian nationals in Sri Lanka are requested to remain aware of the latest developments and accordingly plan their movements and activities. If required, Indian nationals can contact us: High Commission of India in Colombo, Sri Lanka pic.twitter.com/8BLozqggsM
— ANI (@ANI) July 20, 2022