కాఠ్మాండు, ఆగస్టు 28: జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల్లో బాధితులకు సహాయక చర్యలు అందించడం అత్యంత అవసరం. దీంతో తాము నేపాల్కు సహాయం చేస్తామంటూ భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. అయితే మీ సహాయం మాకు అవసరం లేదంటూ నేపాల్ తిరస్కరిస్తున్నది. విదేశాల సహాయం అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే తమకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
మెరుపు వరదలతో తీవ్ర విషాదం నెలకొన్న నేపాల్లో కొందరు అమానవీయంగా చేతివాటం ప్రదర్శిస్తూ మృతదేహాల నుంచి బంగారం, విలువైన ఆభరణాలు అపహరిస్తున్నారు. దీని వీడియో వెలుగులోకి వచ్చింది. నరయాణి నదిలో కొట్టుకుపోతున్న ఒక మహిళ మృతదేహాన్ని కొందరు యువకులు కర్రలతో ఒడ్డుకు లాగి, ఆమె చెవిపోగులు తీసుకుని శవాన్ని తిరిగి నీటిలో వదిలేశారు. సోషల్ మీడియాయే దిక్కు నేపాల్లో వరద విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులు తమ వారికి సమాచారం అందించే కమ్యూనికేషన్ వ్యవస్థ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ నెట్వర్క్లు పనిచేయకపోవడంతో వారు సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు, క్లిప్లను పంపుతూ క్షేమసమాచారాన్ని తెలియజేస్తున్నారు.