కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింఘే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ తొమ్మిది అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో రాణిల్కు అనుకూలంగా 134 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. రాణిల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైనా.. ప్రజల్లో మాత్రం అసహనం ఉంది. ఆయనకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో రాణిల్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దేశం విడిచి పరారీ అయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. తాత్కాలిక దేశాధ్యక్షుడిగా రాణిల్ను నియమించారు.ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు రాణిల్ తెలిపారు.