R Satish Kumar : ఖమ్మంలో రేపు జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ పెట్టిన ఏ సభ పెట్టిన అది ప్రభంజనమే అయిందని, సింహ గర్జన నుంచి మహా గర్జన వరకు అనేక బహిరంగ సభలు విజయవంతం అయ్యాయని ఆయన తెలిపారు.
నేడు మహోజ్వల భారతావని కోసం, దేశంలో గుణాత్మక మార్పుకోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నడుంబిగించారని ఆయన అన్నారు. గుజరాత్ లాంటి నకిలీ మోడల్ కాకుండా తెలంగాణ మోడల్ దేశమంతా అమలు జరిగితే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని సతీప్ ఆకాంక్షించారు. రేపు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు హాజరు కానున్న కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్మాన్ (పంజాబ్), పినరయి విజయన్ (కేరళ), యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలు పార్టీల ప్రతినిధులకు, బీఆర్ఎస్ నాయకులకు సతీష్ అభినందనలు తెలిపారు.