మాస్కో: జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ప్రసంగించారు. ఆరేళ్ల క్రితం ప్రవేశపెట్టిన అత్యాధునిక ఆయుధాలను ఇప్పుడు వినియోగిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిస్సైళ్లను రష్యా దళాలు వాడినట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్ మిలిటరీ టార్గెట్లను అత్యంత కచ్చితత్వంతో అటాక్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అవన్గార్డ్ స్ట్రాటజిక్ హైపర్సోనిక్ గ్లైడర్స్, పెరిస్వెల్ లేజర్ సిస్టమ్లు ఇప్పటికే సర్వీస్లో ఉన్నట్లు ఆయన చెప్పారు.
హైపర్సోనిక్ గ్లైడర్లు లక్ష్యం దిశగా అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు. హై ఆల్టిట్యూడ్లో అత్యంత వేగంగా ఆ మిస్సైళ్లు ప్రయాణిస్తాయి. త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మత్ మిస్సైళ్లను రిలీజ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అణ్వాయుధ సహిత క్రూయిజ్ మిస్సైల్ బురెవెస్నిక్తో పాటు అండర్ వాటర్ అణ్వాయుధ పోసిడాన్ డ్రోన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నట్లు పుతిన్ తెలిపారు.