Prince Harry | బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ‘స్పేర్’ పేరుతో రాసిన పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం ద్వారా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. కాగా, గతంలో భారత పర్యటకు సంబంధించిన పలు విషయాలను పుస్తకంలో పొందుపరిచారు. ఐదేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ పాలరాతి కట్టడం తాజ్మహల్ను సందర్శించారు. సాధారణంగా తాజ్ను సందర్శించిన వారెవరైనా సరే ఆ అందమైన కట్టడం ముందు ఫొటో దిగకుండా ఉండలేరు. మేఘన్ మాత్రం అక్కడ ఫొటో తీసుకోలేదట.
తాజ్ముందు ఫొటో దిగొద్దని మేఘన్కు తానే చెప్పినట్లు హ్యారీ తన పుస్తకం ‘స్పేర్’లో వెల్లడించారు. ఇందుకు కారణం కూడా అందులో రాశారు. ‘పాలరాతి కట్టడమైన తాజ్మహల్ ముందు ఫొటో దిగొద్దని మేఘన్కు నేనే చెప్పా. ఎందుకంటే.. ఆ అద్భుతమైన కట్టడం ముందు నా తల్లి ప్రిన్స్ డయానా ఫొటో దిగారు. అదెంతో ప్రాచుర్యం పొందింది. మేఘన్ కూడా అక్కడ ఫొటో దిగితే ఆమె మా అమ్మను అనుకరిస్తోందని అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే అలా చెప్పా’ అని వివరించారు.
కాగా, ఓ చారిటీ కార్యక్రమంలో భాగంగా జనవరి 2017లో భారత్ వచ్చిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్లకు అప్పటికి వివాహం కాలేదు. అప్పటికి ఆమె హ్యారీ ప్రియురాలిగానే ఉన్నారు. ఆ తర్వాతే వారి వివాహం జరిగింది.