కీవ్: రష్యా దళాల నుంచి విముక్తి పొందిన ఖేర్సన్ పట్టణంలో ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ పర్యటించారు. ఆ సిటీలో ఉన్న ఉక్రెయిన్ దళాలతో ఆయన ముచ్చటించారు. దేశం ముందుకు వెళ్తోందని, శాంతి కోసం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మార్చి నెలలో ఖేర్సన్ సిటీని రష్యా దళాలు హస్తగతం చేసుకున్నాయి. లుహాన్స్క్, డొనెస్కీ, జపొరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటున్నట్లు ఇటీవల పుతిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఉక్రెయిన్ దళాలు ఖేర్సన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. గత శుక్రవారం ఆ నగరం మళ్లీ ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్లింది.
సోమవారం ఖేర్సన్ వెళ్లిన జెలెన్స్కీ అక్కడ ఉన్న దళాలతో మాట్లాడారు. తాము శాంతి కోసం సిద్ధంగా ఉన్నామన్నారు. రష్యాపై యుద్ధంలో సహకరించిన నాటో దళాలు, ఇతన కూటములకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన హిమార్స్ రాకెట్లతో శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.