ఢాకా: పాకిస్థాన్పై బంగ్లాదేశ్ విజయం సాధించిన 50 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ విక్టరీ డే పరేడ్ను నిర్వహించారు. ఆ పరేడ్కు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ వేళ ఆయన గౌరవ వందనం స్వీకరించారు. బంగ్లా రక్షణశాఖ ఈ సందర్భంగా ఏరోబాటిక్స్ విన్యాసాలు నిర్వహించింది. భారత్కు చెందిన 122 మంది సభ్యుల త్రిదళాల బృందం కూడా ఆ పరేడ్లో పాల్గొన్నది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎం అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలు కూడా ఆ పరేడ్ను వీక్షించారు. 1971లో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ సహకరించింది.