వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రభుత్వంలో మొదటి నుంచీ భారతీయ మూలాలున్నవారికి ప్రాధన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరో ఇండియన్ అమెరికన్కు ఉన్నత బాధ్యతలను అప్పజెప్పారు. ఇండియన్ అమెరికన్ పునీత్ తల్వార్ను మొరాకోలో అమెరికా రాయబారిగా నియమించారు. ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రకటన విడుదల చేసింది.
పునీత్ తల్వార్.. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్లో బీఎస్ డిగ్రీ చేశారు. అనంతరం కొలంబియా వర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎంఏ పూర్తి చేశారు. శ్వేత సౌధంలోని స్టేట్ డిపార్ట్మెంట్లో నేషనల్ సెక్యూరిటీ, ఫారెన్ పాలసీ రూపకర్తగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు.
గతంలో అధ్యక్షుడికి పొలిటికల్, మిలిటరీ అఫైర్స్లో స్పెషల్ అసిస్టెంట్గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో సీనియర్ డైరెక్టర్గా, యూఎస్ సెనెట్లో ఫారెన్ రిలేషన్స్ కమిటీలో సీనియర్ ప్రొఫెషనల్ స్టాఫ్ మెంబర్గా సేవలు అందించారు. బైడెన్ అభిమానాన్ని చూరగొన్న పునీత్ ఇప్పుడు మొరాకోలో రాయబారిగా నియమితులయ్యారు.
కాగా, పునీత్తోపాటు ట్రినిడాడ్ అండ్ టొబాగో అంబాసిడర్గా కాండెన్స్ బాండ్, ఖ్వతార్ రాయబారిగా టిమ్మి డేవిస్ను అధ్యక్షుడు బైడెన్ నియమించారు.