మనీలా, డిసెంబర్ 2: దక్షిణ ఫిలిప్పైన్స్లోని మిండానావో ద్వీప తీర ప్రాంతంలో శనివారం బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. 32 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
భూకంప తీవ్రత, కేంద్రం లోతు అధారంగా దక్షిణ ఫిలిప్పైన్స్తో పాటు ఇండోనేషియా, మలేషియా, పలావ్లోని పలు తీర ప్రాంతాలను సునామీ అలలు తాకే అవకాశం ఉన్నదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్(పీటీడబ్ల్యూసీ) పేర్కొన్నది. మిండానావో తూర్పు తీరంలోని సురిగావ్ దేల్ సుర్, దావో ఓరియంటల్ ప్రావిన్స్ల ప్రజలు వెంటనే ఎగువ మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఓ ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఏజెన్సీ పేర్కొన్నది.