Post COVID | జెరూసలెం, మే 14: ఆక్సిజన్ థెరపితో పోస్ట్ కొవిడ్తో బాధపడుతున్న వారికి ఉపశమనం లభించనున్నది. కొవిడ్ అనంతర లక్షణాలతో గుండె పనితీరు మందగించి ఇబ్బంది పడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా మేలు జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఇజ్రాయెల్లోని సాక్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి చెందిన పరిశోధకుడు మారినా లెట్మన్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించారు.
కొవిడ్ అనంతరం కొంతమందిలో గుండె పనితీరు మందగిస్తున్నది. వాంతులు, వికారం, తలనొప్పి, శ్వాస నెమ్మదించడం, ఆందోళన, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ సమస్యనే పోస్ట్ కొవిడ్ అంటారు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న 60 మందికి హైపర్బారిక్ స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించారు. 8 వారాల తర్వాత 48 శాతం మందిలో గుండె పనితీరు మెరుగవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.