వెల్లింగ్టన్: కోవిడ్ టీకా నియమావళికి వ్యతిరేకంగా న్యూజిలాండ్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అయితే ఆ ఆందోళనలు ఇవాళ హింసాత్మకంగా మారాయి. గత 23 రోజుల నుంచి పార్లమెంట్ భవనం ముందు నిరసనకారులు టెంట్లు వేసుకుని ప్రదర్శన చేస్తున్నారు. వ్యాక్సిన్ తప్పనిసరి నియమాన్ని ఎత్తివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నిరసనకారులను తరిమేందుకు పోలీసులు పప్పర్ స్ప్రే చల్లారు. ఆ సమయంలో అక్కడ పోలీసులకు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. టెంట్లకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో గుంపును చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.
వెల్లింగ్టన్లో రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ ఆంక్షలను ఎత్తివేయాలని న్యూజిలాండ్లో నిరసనకారులు ట్రక్కులు, కార్లు, మోటారుసైకిళ్లతో గత మూడు వారాల నుంచి ప్రదర్శన చేపడుతున్నారు.