వార్సా: ఖతార్లో ఫుట్బాల్ వరల్డ్కప్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా ఖతార్ చేరుకుంటున్నాయి. ఇక పోలాండ్ జాతీయ ఫుట్బాల్ జట్టు కూడా ఖతార్ పయనమైంది. ఇటీవల పోలాండ్లో క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో .. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు.. ఆ విమానానికి ఎస్కార్ట్గా వెళ్లాయి.ఉక్రెయిన్, రష్యాతో బోర్డర్ కలిగి ఉన్న పోలాండ్.. తమ ప్లేయర్లను సురక్షితంగా దేశం దాటించేందుకు అమెరికా సాయం కోరింది. పోలాండ్ ఫుట్బాల్ జట్టుకు చెందిన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఎఫ్-16 ఎస్కార్ట్ విమానాల వీడియోను పోస్టు చేశారు. వరల్డ్కప్లో గ్రూప్ సీలో పోలాండ్ ఆడనున్నది. మంగళవారం మెక్సికోతో తొలి మ్యాచ్లో ఆ దేశం పోటీపడనున్నది.
Do południowej granicy Polski eskortowały nas samoloty F16! ✈️ Dziękujemy i pozdrawiamy panów pilotów! 🇵🇱 pic.twitter.com/7WLuM1QrhZ
— Łączy nas piłka (@LaczyNasPilka) November 17, 2022