Thamilanadu | టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ కరూర్ జిల్లా పర్యనటలో భద్రతా లోపం చోటుచేసుకుంది. కరూర్లోకి ప్రవేశిస్తుండగా భారీ భద్రతను దాటుకుని ఓ వ్యక్తి ఆయన కాన్వాయ్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడు. సీఎం వాహనం వద్దకు చేరుకునే లోపే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకుని పక్కకు లాగేశారు. వేలాది మంది మద్దతుదారులు దారి పొడవునా గుమిగూడి విజయ్కు మద్దతుగా పూల రేకులు చల్లుతూ, నినాదాలు చేశారు.
జనసమూహాలను నియంత్రించడానికి పోలీసులు బారికేడ్లు, సిబ్బందితో సహా విస్తృత భద్రతా చర్యలను చేపట్టారు. అయినప్పటికి ఓ వ్యక్తి భద్రతను దాటుకొని ముందుకెళ్లడం గమనార్హం. కాగా, 2025 సెప్టెంబర్ 27న టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సీఎం విజయ్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి సహాయం, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడానికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది.